మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టులో విచారణ

మణిపూర్ అల్లర్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఇప్పటికే హింసాత్మక ఘటనలను భారత అత్యున్నత న్యాయస్థానం సుమోటాగా తీసుకోగా బాధిత మహిళలు కూడా ధర్మాసనాన్ని ఆశ్రయించారు.

కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన బాధిత మహిళలు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోర్టును కోరారు.

మరోవైపు కేసు విచారణను మణిపూర్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది.

ఈ మేరకు కేంద్రం మరియు బాధితుల పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరపనుంది.

Br 4 Bet Customer Support And Service Quality (UK)