తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ దర్శించుకున్నారు

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.

ర‌మ‌ణ దర్శించుకున్నారు.ఇవాళ వేకువజామున అభిషేక సేవలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొనగా, సుప్రీంకోర్టు సీజే వెంట తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయన్ కూడా అభిషేక సేవలో పాల్గోన్నారు.

వీరికి ఆలయ మహా ద్వారం వద్ద టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టిటిడి ఈవో ధర్మారెడ్డిలు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు.

దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

దేవర విషయంలో నెలకొన్న గందరగోళం.. ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే అలా చేయాల్సిందే!