హస్తం పార్టీకి ఆదరణ – బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య

హస్తం పార్టీకి మహిళల ఆదరణ పెరుగుతుందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య( Congress Party Dommati Narsaiah ) అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట,వీర్నపల్లి మండలాలలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆరు పథకాల గ్యారెంటీ కార్డుల పంపిణీలో మహిళలు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ చూపించడం జరుగుతుందన్నారు.

గృహలక్ష్మి కింద 25 వందలు మహిళలకు నెల నెలా ఇవ్వడం జరుగుతుందన్నారు.బస్సులో ఉచిత ప్రయాణం( Free Bus Travel )తో పాటు 500 లకే సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు.

4వేల పెన్షన్ పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు.రైతులకు రుణమాఫీ తో పాటు క్వింటాల్ వడ్లకు 500 బోనస్ ఏడాదికి 15వేలు కౌలు రైతుకు, 12 వేలు ఇస్తామని చెప్పడం పట్ల రైతులు హర్షిస్తున్నారని పేర్కొన్నారు.

విద్యార్థుల చదువుల కోసం 5 లక్షల గ్యారెంటీ కార్డును విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం పట్ల సామాన్య కుటుంబాలు సంతోషపడుతున్నాయని అన్నారు.

ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, బీపేట రాజు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: వీధులలో నివసిస్తున్న మహిళకి ఊహించలేని గిఫ్ట్ ఇచ్చిన యూట్యూబర్..