వైజాగ్ లో సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి నెక్స్ట్ షెడ్యూల్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాలలో జరిగినవి చాలా తక్కువ అని చెప్పాలి.

కెరియర్ ఆరంభంలో ఏవో కొన్ని సినిమాలు వైజాగ్ లో షూట్ చేశారు.అయితే ఇప్పుడు పరశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీ షూటింగ్ కోసం చాలా ఏళ్ల తర్వత సూపర్ స్టార్ మహేష్ బాబు వైజాగ్ రానున్నాడు.

ఈ విషయాన్ని దర్శకుడు పరశురాం అధికారికంగా కన్ఫర్మ్ చేశాడు.భారీ బడ్జెట్ తో సర్కారు వారి పాట మూవీ తెరకెక్కుతుంది.

యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.ఇప్పటికే ఈ మూవీ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యింది.

బ్యాంకులని రుణాల పేరుతో మోసం చేస్తూ విదేశాలు పారిపోయిన కార్పోరేట్ దొంగల కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబుకి జోడీగా కనిపించబోతుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం దర్శకుడు పరశురాం రెడీ అవుతున్నాడు.

"""/"/ అందులో భాగంగా విశాఖకి లోకేషన్స్ చూడటానికి వచ్చారు.ఈ సందర్భంగా సర్కారు వారి పాట సినిమాలో ఓ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలని విశాఖలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.

త్వరలో విశాఖ షెడ్యూల్ ఉంటుందని, ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొంటారని స్పష్టం చేశారు.

మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ షూటింగ్ విశాఖలో జరగబోతుంది అనే తెలియడంతో ఉత్తరాంధ్రలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోసం ఆ సమయం కోసం వేచి చూస్తున్నారు.

ఇంట్లోకి త‌ర‌చూ పాములు వ‌స్తున్నాయా.. ఇలా చేశారంటే వాటితో ఇక‌పై నో టెన్ష‌న్‌!