నాకు జీవితం ఇచ్చింది దర్శకులే.. సందీప్ కిషన్ షాకింగ్ రివిలేషన్?

టాలీవుడ్ యంగ్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో సందీప్ కిషన్ అందరికీ సుపరిచితమే.

తాజాగా సందీప్ కిషన్ మధుర వైన్స్ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.

ఈ వేడుకలో పాల్గొన్న సందీప్ కిషన్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ తాను కెరియర్ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించానని తనకు లైఫ్ ఇచ్చినది షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ అని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇకపోతే మధుర వైన్స్ సినిమాలో సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి బండి జయ కిషోర్ దర్శకత్వం వహించగా రాజేష్, సృజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 22వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సందీప్ కిషన్ పాల్గొన్నారు.

"""/"/ ఇక ఇందులో హీరోగా నటించిన సన్నీ మాట్లాడుతూ వారు గతంలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించారని హీరోగా మొట్టమొదటిసారిగా మధుర వైన్స్ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నట్లు తెలియజేశారు.

ఇప్పటివరకు చాలా మంది కేవలం షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే తీస్తున్నానని తనని నిరుత్సాహపరిచారు.

అయితే తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మొట్టమొదటిసారిగా హీరోగా మీ ముందుకు రాబోతున్నాను ఆశీర్వదించండి అంటూ సన్నీ మాట్లాడారు.

దళితులపై నారా భువనేశ్వరి అసభ్య పదజాలం.. ఫేక్ కాదని నిర్ధారణ..!!