కొత్త సినిమా స్టార్ట్ చేసిన సందీప్ కిషన్

టాలీవుడ్ లో యంగ్ టాలెంటెడ్ హీరోలు చాలా మంది భిన్నమైన కథలతో ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

ఒకప్పుడు కమర్షియల్ కథల చుట్టూ తిరిగిన యంగ్ హీరోలు ఇప్పుడు కొత్తదనం ఉన్న కథలతో ప్రేక్షకులని మెప్పించడానికి రెడీ అవుతున్నారు.

తనకి సెట్ అయ్యే కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఈ కారణంగా టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో మంచి కథలు, టాలెంటెడ్ దర్శకులు వెండితెరకి పరిచయం అవుతున్నారు.

కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకుంటూ వెళ్తున్న హీరోలు బోర్లా పడుతున్నారు.కమర్షియల్ సినిమా అయినా మంచి కథ, కథాంశం ఉంటేనే సినిమాలు నిలబడతాయని తాజాగా రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా ప్రూవ్ చేసింది.

ఈ నేపధ్యంలో యువ హీరో సందీప్ కిషన్ కెరియర్ ఆరంభం నుంచి ఎక్కువగా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కథలతోనే సినిమాలు చేశాడు.

నటుడుగా గుర్తింపు పొందిన హీరోగా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు.అయితే ఈ సారి స్పీడ్ పెంచడంతో పాటు కొద్దిగా భిన్నమైన కథలని ఎంపిక చేసుకుంటున్నాడు.

తాజాగా ఎ1 ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా టీజర్ సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

హాకీ నేపధ్యంలో నడిచే ఈ సినిమా కథ, కథాంశం ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఉంది.

దీంతో హిట్ కొట్టేలా ఉన్నదనే టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ లో మరో కొత్త సినిమాని సందీప్ కిషన్ స్టార్ట్ చేశాడు.

ఈ సినిమాతో వేదవ్యాస్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.తాజాగా ఈ సినిమా లాంచింగ్ జరిగింది.

ఈ సినిమా ఓ డిఫరెంట్ కథాంశంతో స్క్రీన్ ప్లే బేస్ మీద నడిచే కథగా ఉండబోతుందని మూవీ లాంచింగ్ సందర్భంగా నిర్మాత కోనేరు మహేష్ క్లారిటీ ఇచ్చారు.

+.

ఒకటి కాదు.. ఒకేసారి రెండు సినిమాలతో వస్తున్నాం మమ్మల్ని ఆదరించండి..!