పుష్పలో ఆ పాయింట్‌ను వదలని సుకుమార్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

ఇక ఈ సినిమాను పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సుక్కు తెరకెక్కిస్తుండటంతో బన్నీ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో ఆయన ఓ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో సుకుమార్ ఓ సరికొత్త పాయింట్‌ను కూడా టచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో స్మగ్లర్లు, పోలీసులతో పాటు కూలీల జీవితాలను కూడా మనకు కళ్లకు కట్టినట్లు చూపించేందుకు సుకుమార్ రెడీ అవుతున్నారు.

పొట్టకూటి కోసం కూలీలుగా మారిన వారు ఈ స్మగ్లింగ్ ఉచ్చులో ఎలా ఇరుక్కుంటారు అనే అంశాన్ని మనకు సుకుమార్ చూపించనున్నాడట.

ఈ పాయింట్‌పైనే సినిమా కథ నడుస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.మొత్తానికి సుకుమార్ తాను తీస్తున్న సినిమాలో కథకు సంబంధించి ఎలాంటి పాయింట్‌ను వదిలే ప్రసక్తే లేదని ఈ సినిమాతో మరోసారి నిరూపించనున్నాడట.

ఇక ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాలో విలన్ పాత్రలో తొలుత తమిళ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోగా, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడు.

ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్..: కిషన్ రెడ్డి