దసరా తర్వాత సుకుమార్, విజయ్ సినిమా సెట్స్ పైకి

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి అదృష్టం ఒక రేంజ్ లో దూసుకుపోతుంది.అతని హార్డ్ వర్క్ కి అదృష్టం కూడా తోడుండటంతో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంటున్నాడు.

విజయ్ దేవరకొండ చివరిగా నటించిన మూడు సినిమాలు నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ అయ్యాయి.

అయినా కూడా అతనితో పూరీ జగన్నాథ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమాని కరణ్ జోహార్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత షెడ్యూల్ జనవరి ఫెస్టివల్ తర్వాత ముంబైలో మొదలుకాబోతుంది.

ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

ఇది ఓ థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కబోతుందని తెలుస్తుంది.ఇందులో విజయ్ దేవరకొండ సైనికుడుగా కనిపిస్తాడని టాక్.

"""/"/ ఇదిలా ఉంటే సుకుమార్, విజయ్ సినిమాని దసరా తర్వాత స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ దర్శకుడు అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతుంది.

చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలిమెంట్ చుట్టూ కథ ఉండబోతుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమల్లి ఫారెస్ట్ లో జరుగుతుంది.సుకుమార్ చాలా ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేస్తున్నాడు.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం వలన అన్ని బాషల ప్రేక్షకులని మెప్పించే విధంగా సినిమా ఉండాలని అనుకుంటున్నారు.

దానికి తగ్గట్లే క్యాస్టింగ్ ఎంపిక జరిగింది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రిలీజ్ చేసిన తర్వాత విజయ్ దేవరకొండ సినిమాపై ఫోకస్ పెడతాడు.

ఈ నేపధ్యం వారి కాంబినేషన్ స్టార్ట్ దసరా తర్వాత ఆగష్టులో షూటింగ్ జరుపుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురు..!!