చక్కెరతో ఇలాంటి చిట్కాలు పాటిస్తే ఆర్థిక కష్టాలు దూరమవుతాయా..

జీవితంలో చాలా మంది ప్రజలు వారి రోజువారి పనులలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఏ పని చేయాలన్నా కచ్చితంగా డబ్బు అవసరం అవుతూ ఉంటుంది.

ఆ ఇంటి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉండాలంటే చక్కెరతో ఇలాంటి కొన్ని చిట్కాలను పాటిస్తే ఆర్థిక కష్టాలు దూరమై, ఇంకా వారు అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురవకుండా ఉంటాయి.

చక్కెర మన జీవితంలో చేసే తీయని వంటకాలలో ప్రతిరోజు ఉపయోగిస్తూనే ఉంటాం.అయితే కొన్ని షుగర్ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు.

అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని, ఇంట్లో ఆనందం, శాంతిని తెచ్చుకోవచ్చని చాలామందికి తెలియదు.

పంచదార ఉపయోగించి ఇంట్లో కొన్ని చిట్కాలను ఉపయోగించడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.

పితృ దోషం వల్ల కుటుంబంలో చాలా సమస్యలు బాధలు వస్తూ ఉంటాయి.దానివల్ల పితృ దోషాన్ని తొలగించడం చాలా ముఖ్యం.

పిండిలో పంచదార కలిపి చపాతీలా చేసి కాకులకు తినిపించాలి.దీనివల్ల ఈ దోషం తొలగిపోయి ఆ ఇంట్లో సుఖసంతోషాలు మొదలవుతాయి.

కొంతమంది జాతకంలో రాహు గ్రహం స్థితిని బలోపేతం చేయడంలో ఈ పరిహారం ఎంతో ప్రభావంతంగా ఉంటుంది.

"""/"/ ఇంకా చెప్పాలంటే ఏదైనా ముఖ్యమైన పనికి ముందు పెరుగులో పంచదార కలిపి తినే ఆచారం చాలామంది ఇళ్లలో ఉంది.

ఏదైనా పెద్ద పని, ముఖ్యమైన పని చేసేటప్పుడు మీకు అదృష్టాన్ని అందించే మరొక పరిష్కారం ఇది రాగి పాత్రలో చక్కెర నీటిని కరిగించి ఇంటి నుంచి బయలుదేరే ముందు తాగాలి.

ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.చీమలకు పంచదార పొడి కొబ్బరి కలిపి ఆహారంగా వేస్తే శని దేవుడు సంతోషిస్తాడు.

ఈ పరిహారం శనిని ప్రశాంతంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.ఇలా చేస్తే శని దోషం కూడా తొలగిపోయే అవకాశం ఉందని వేద పండితులు చెబుతున్నారు.