మహేష్ బాబుకు రూ.200 కోట్లు ఇచ్చినా ఆ పని చేయడట.. అసలేమైందంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను చూసి ఆ సినిమా గురించి పాజిటివ్ గా పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

సుధీర్ బాబు సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

శ్రీదేవి సోడా సెంటర్ రెగ్యులర్ సినిమా కాదని తాము మంచి కంటెంట్ తో ఉన్న సినిమాను తీశామని అన్నారు.

శ్రీదేవి సోడా సెంటర్ ను చూసిన ప్రేక్షకులకు సినిమాలోని శ్రీదేవి, సూరిబాబు పాత్రలు గుర్తుండిపోతాయని వెల్లడించారు.

శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను చూసిన ప్రేక్షకులలో ఎవరూ కూడా సినిమా బాలేదని అయితే చెప్పలేదని సుధీర్ బాబు అన్నారు.

అందరి నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని సుధీర్ బాబు కామెంట్లు చేశారు.

శ్రీదేవి సోడా సెంటర్ మూవీ బాగుందని మహేష్ బాబు, దర్శకుడు ప్రశాంత్ నీల్, రానా, నిహారిక పోస్టులు పెట్టారని సుధీర్ బాబు అన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తను నమ్మనిది ఏదీ చేయడని సుధీర్ బాబు అన్నారు.

ఎవరైనా బెదిరించినా లేదా 200 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా కూడా కెరీర్ విషయంలో మహేష్ నమ్మనిది చేయడని సుధీర్ బాబు పేర్కొన్నారు.

శ్రీదేవి సోడా సెంటర్ మూవీ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని సినిమా నచ్చితే ఆ విషయాన్ని పది మందికి చెప్పాలని సుధీర్ బాబు సూచించారు.

కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమా చూడాలని శ్రీదేవి సోడా సెంటర్ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని సుధీర్ బాబు కామెంట్లు చేశారు.

"""/"/ శ్రీదేవి సోడా సెంటర్ మూవీ కొరకు సహకరించిన వాళ్లకు సుధీర్ బాబు ధన్యవాదాలు తెలిపారు.

తొలిరోజే కోటీ 40 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఫుల్ రన్ లో నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

పుష్ప 2 సినిమా పేరు చెబితే చాలు బాలీవుడ్ భయపడుతుందా..?