విద్యార్థులు మన దేశ సంప్రదయాల్ని కాపాడాలి – ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆషాడ మాసాన్ని పునస్కరించుకొని బుధవారం రోజున పాఠశాలలోని మొత్తం విద్యార్థినిలకు మెహిందీ( గోరింటాకు) పెట్టడం జరిగింది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ హరినాధరాజు మాట్లాడుతూ మన దేశ సంప్రదాయాలు ఒకటైన గోరింటాకు పెట్టుకోవడం అనేది కేవలం సాంప్రదాయంగా పరంగా కాకుండా సైన్స్ పరంగా కూడా శరీరంలోని వచ్చే మార్పులను సమతుల్యత ఉంచడానికి దోహదపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రం గంగానర్సయ్య, పడాల సురేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆ హిట్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్.. వరుస ఫ్లాపులకు బ్రేక్ పడినట్లేనా?