భీమవరం బీసీ హాస్టల్‎లో విద్యార్థులకు అస్వస్థత

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బీసీ హాస్టల్‎లోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది.

హాస్టల్ లో ఆహారం తిన్న సుమారు 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వెంటనే స్పందించిన సిబ్బంది విద్యార్థులను హుటాహుటిన భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆస్పత్రిలో బాధితులకు వైద్యం కొనసాగుతోంది.