రైతుల వేషధారణతో విద్యార్థిని విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థిని విద్యార్థులకు అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్స్( Agricultural Field Works ) గురించి పొలాల వద్దకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత శనివారం తీసుకువెళ్లారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలోని ఐదో తరగతి విద్యార్థులకు సైన్స్( Science ) పుస్తకంలోని పాఠ్యాంశంలో భాగంగా వ్యవసాయం గురించి రైతులు( Farmers ) చేసే పనుల గురించి శనివారం విద్యార్థిని విద్యార్థులకు రైతుల వేషధారణ ధరించి శివారులో ఉన్న పొలాల వద్దకు తీసుకువెళ్లి ప్రాక్టికల్ గా చూపించడం జరిగిందని ప్రధానోపాధ్యాయురాలు రజిత పేర్కొన్నారు.

ఈ వేషధారణలో సుమారు 13 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

స్కిల్ ఉంటేనే ఎంట్రీ, కఠిన నిబంధనలు… విదేశీ విద్యార్ధులపై ఆస్ట్రేలియా కొత్త పాలసీ