శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు – సిరిసిల్ల సీఐ సదన్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక, సోమవారపేట్, పెద్ద లింగాపూర్, గొల్లపల్లి, వెంకట్రావుపల్లి, రామోజీపేట గ్రామాల్లో కేంద్ర బలగాలచే శుక్రవారం రోజున ఉదయం కవాతు నిర్వహించారు.

ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగవలసిన అవసరం ఉందని, ప్రతి పౌరుడు తన యొక్క ఓటును స్వేచ్ఛగా వినియోగించేలా చూడాలని, ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినా,అమాయక ప్రజలను బెదిరించినా చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.

ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తన ఓటు ను వినియోగించుకునేందుకు, ప్రశాంత వాతావరణo లో ఎన్నికలు జరిగేలా, ప్రతి పౌరుడిలో ధైర్యం నింపేందుకు ఎన్నికల కమిషన్ కృషి చేస్తుందని వివరించారు.

ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉందని, ఇతరుల ఎన్నికల ప్రచారాన్ని గాని కార్యక్రమాలను గాని ఎవరైనా ఆటంకపరిచినా, అడ్డగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రూరల్ సిఐ సదన్ కుమార్ తెలిపారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ లు భూమయ్య ఫసియోద్దిన్, కానిస్టేబుళ్లు మధు లక్ష్మినారాయణ పాల్గొన్నారు.

హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే తమలపాకులు.. ఎలా వాడాలంటే?