కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో పిచ్చికుక్క స్వైరవిహరం

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో పిచ్చికుక్క వీరంగం సృష్టించింది.ఇంటిలోకి ప్రవేశించిన పిచ్చికుక్క రెండు నెలల చిన్నారిపై దాడికి పాల్పడింది.

కుక్క దాడిలో తీవ్రగాయాలు కావడంతో చిన్నారిని తల్లిదండ్రులు హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

కాగా చిన్నారి ముఖంపైనే సుమారు యాభైకి పైగా కుట్లు వేశారని తెలుస్తోంది.దాంతో పాటు 21 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాలని, అందుకు రూ.

10 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

యూకే కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారిన వలస వ్యతిరేక నిరసనలు..!