నయన్, విఘ్నేశ్ ల లవ్ స్టోరీ ఏ సినిమాతో మొదలైందో తెలుసా?

కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార విగ్నేష్ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వీరిద్దరూ కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలారు.ఇదే వీరిద్దరూ మొదట్లో ప్రేమించుకున్న విషయం కూడా చాలా రోజులపాటు గోప్యంగా ఉంచారు.

తర్వాత వారు ప్రేమించుకుంటున్నట్లు కన్ఫామ్ అవడంతో ఆ తర్వాత చెట్టాపట్టాలేసుకొని ఎక్కడికి వెళ్లినా కలిసి తిరిగారు.

అలా ఎట్టకేలకు ఈ జంట ఈ ఏడాది మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.ఇకపోతే ఇటీవల ఈ జంట తల్లిదండ్రులు అయిన విషయం కూడా తెలిసిందే.

అయితే నయనతార, విగ్నేష్ శివన్ అభిమానులకు వారి ప్రేమ కథ గురించి వారి ప్రేమ ఎలా మొదలైంది అన్న విషయాల గురించి తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

వీరిద్దరి పరిచయం ఎక్కడ ఏర్పడింది? ఏ సినిమాతో ఏర్పడింది.ఇప్పుడు ప్రేమలో పడ్డారు? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నయనతార విగ్నేష్ శివన్ లు ఏడేళ్ల పాటు ప్రేమించుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించారు.వీరిద్దరి కాంబినేషన్లో 2015 లో వచ్చిన సినిమా నానుమ్ రౌడీ ధాన్.

2015 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

కాగా ఈ సినిమా విడుదల అయ్యి నేటికి ఏడేళ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.

నానుమ్ రౌడీ ధాన్ సినిమా షూటింగ్ సందర్భంగా మొదటిసారి విగ్నేష్ శివన్ నయనతారను కలిశారట.

"""/"/ ఇక అప్పటి నుంచి వీరి లవ్ స్టోరీ మొదలైంది.నానుమ్ రౌడీ ధాన్ సినిమాలో హీరోయిన్గా మొదటి నయనతారను కాకుండా వేరే హీరోయిన్ ఎంపిక చేశారట.

కానీ ఆ తర్వాత ఒకరోజు హోటల్లో నయనతారను విగ్నేష్ కలుసుకోవడంతో ఈ సినిమాకు ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారట.

సినిమా విడుదల ఏడేళ్లు అయిన సందర్భంగా విగ్నేష్ శివన్ సెట్స్ లో ఉండే వీడియోని పంచుకున్నారు.

ఆ వీడియోలు విగ్నేష్ డైరెక్షన్ చేస్తూ మాట్లాడుతూ ఉండగా అందరూ పక్కన నవ్వుతూ ఉన్నారు.

పక్కనే నయనతార కూడా నవ్వుతూ కనిపిస్తోంది.కాగా ఎందుకు సంబంధించిన వీడియోని విగ్నేష్ షేర్ చేస్తూ ఒకప్పుడు పాండీవుడ్ లో అంటూ క్యాప్షన్ జోడించాడు.

ఇక ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

ఎట్టకేలకు ఆ గాసిప్స్ ని నిజం చేస్తూ ఈ జంట ఈ ఏడాది మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

హ్యాపీ బర్త్డే ధోని.. కెప్టెన్‌ లలో ‘ఎంఎస్ ధోనీ’ వేరయా..