అభిమానులకు శుభవార్త చెప్పిన స్టార్ సింగర్ సునీత.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ సింగర్లలో ఒకరైన సునీతకు సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

గుంటూరు జిల్లాకు చెందిన సునీత గులాబి, ఎగిరే పావురమా సినిమాలతో మంచి పేరును సొంతం చేసుకున్నారు.

చిన్న వయస్సులోనే గాయనిగా కెరీర్ ను మొదలుపెట్టిన సునీత వేల సంఖ్యలో పాటలను పాడటంతో పాటు 500 కంటే ఎక్కువ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేశారు.

అయితే తాజాగా సింగర్ సునీత అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.ఒకవైపు సునీత సింగర్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

అభిమానులకు సునీత ఇకపై వన్ మినిట్ వీడియో రీల్ చేస్తానని అదిరిపోయే తీపికబురు అందించారు.

ఇందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.సునీత వెల్లడించిన విషయాలు ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలుగజేస్తున్నాయి.

సునీత ఏ పాట పాడినా ఆ పాటకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం అయితే లేదు.

కొంతమంది హీరోయిన్లకు సునీత చెప్పిన డబ్బింగ్ ఆయా సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.

3,000కు పైగా పాటలు పాడిన సింగర్ సునీత రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

19 సంవత్సరాల వయస్సులోనే సునీతకు పెళ్లి కాగా కొన్ని రీజన్స్ వల్ల మొదటి భర్తతో ఆమె విడిపోయారు.

"""/" / ఆ తర్వాత సునీత ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన రామ్ వీరపనేనిని గతేడాది పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

సునీత రెండో పెళ్లి చేసుకోవడంపై కొంతమంది విమర్శలు చేసినా సునీత మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు.

సునీత తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రభాస్ అంత పెద్ద మోసగాడా.. సినిమాల్లో ఎంత మందిని మోసం చేశాడంటే..?