రాజమౌళి వల్ల ఆకలి చచ్చిపోయిందంటున్న ఎన్టీఆర్..!

దర్శకధీరుడు, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యం అయిన ఈ సినిమాను 2021 దసరాకు విడుదల చేసే విధంగా రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నారు.

ప్రతి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటున్న రాజమౌళి సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంతో పర్ఫెక్ట్ గా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటారు.

పని విషయంలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించే రాజమౌళిపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, చరణ్, కీరవాణి తమకున్న కంప్లెయింట్స్ ను నిన్న రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా వెల్లడించారు.

ఎన్టీఆర్ రాజమౌళి గురించి మాట్లాడుతూ ఎప్పుడైతే తాను రిలాక్స్ అవ్వాలని అనుకుంటానో అప్పుడే రాజమౌళి కష్టమైన సీన్లను షూటింగ్ చేద్దామని చెబుతాడని అన్నారు.

రాజమౌళికి ఏదీ ఒక పట్టాన నచ్చదని కామెంట్ చేశారు.మధ్యాహ్నం 12.

30 గంటలకు షాట్ పెడతారని దాదాపు రెండు గంటల వరకు షూట్ చేయడంతో ఆకలి చచ్చిపోతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రతి సన్నివేశం పర్ఫెక్ట్ గా రావాలెనే ఉద్దేశంతో రాజమౌళి ఆ సన్నివేశం తనకు 100 శాతం సంతృప్తిని ఇచ్చేవరకు చెక్కుతూనే ఉంటారని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

అలా చెక్కుతూ ఉండటం వల్లే రాజమౌళి పేరు కాస్తా జక్కన్నగా మారిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

పర్ఫెక్షన్ పేరుతో రాజమౌళి మమ్మల్ని చంపేస్తున్నారని.ఒక సన్నివేశం కోసం అర్ధరాత్రి ఒకటిన్నరకు షూటింగ్ ను ప్రారంభించి ఉదయం నాలుగున్నరకు పేకప్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయని అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కూడా సరదాగా రాజమౌళిపై కంప్లెయింట్స్ చేయడం గమనార్హం.

నా జీవితాన్ని మార్చేసిన సినిమా అది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన బన్నీ?