భార్య కాళ్లు పట్టుకోవడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య.. ఏం చెప్పారంటే?

స్టార్ హీరో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా ఎంపికైన సమయంలో చాలామంది విమర్శలు చేశారు.

టాక్ షోకు హోస్ట్ గా బాలయ్య కరెక్ట్ కాదని చాలామంది భావించారు.అయితే తన హోస్టింగ్ తో తనపై వ్యక్తమైన విమర్శలకు బాలయ్య చెక్ పెట్టారు.

బాలయ్య టాక్ షోకు ప్రముఖ సెలబ్రిటీలు వస్తుండటంతో ఈ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తాజాగా అన్ స్టాపబుల్ ప్రోమో రిలీజ్ కాగా ఈ షోకు రానా గెస్ట్ గా హాజరయ్యారు.

రానా షోలోకి ఎంట్రీ ఇచ్చి నా టాక్ షోలో బెస్ట్ ఎపిసోడ్ ప్రతి సీజన్ మీరే సార్ అని చెప్పగా బాలకృష్ణ కొత్తగా చెబుతావేంటయ్యా బాలకృష్ణ అంటేనే బెస్ట్ అని చెప్పుకొచ్చారు.

ఫస్ట్ టైమ్ బాలకృష్ణ టార్చర్ చేస్తున్నాడంటే మీకు ఏం అనిపించిందని రానాను అడగగా మేమందరం మామూలు ట్రైన్ లో వెళుతుంటే మీరు బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చారని అనిపించిందని రానా అన్నారు.

లాక్ డౌన్ సమయంలో వ్యాక్సిన్ వస్తుందనుకుంటే నీ పెళ్లి న్యూస్ వచ్చిందేంటయ్యా బాబు అని బాలయ్య అడగగా చేసినవన్నీ అయిపోయాయని పెళ్లి మాత్రం చేసుకోలేదని భావించి పెళ్లి చేసుకున్నానని రానా చెప్పుకొచ్చారు.

రానా ఈ షోలో దానవీర శూరకర్ణ సినిమాలోని డైలాగ్ ను అద్భుతంగా చెప్పి మెప్పించారు.

"""/"/ఆర్గ్యుమెంట్ అయితే ఫస్ట్ సారీ చెప్పేదెవరని రానా అడగగా నేనే అని బాలయ్య చెబుతూ కృష్ణుడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడని బాలకృష్ణుడు ఒక లెక్కా అంటూ చెప్పుకొచ్చారు.

మీరెప్పుడన్నా వసుంధర గారికి ఐ లవ్ యూ అని చెప్పారా అంటూ రానా అడగగా బాలయ్య నీకెందుకయ్యా అంటూ సమాధానం ఇచ్చారు.

"""/"/ ఆ తర్వాత భార్యకు బాలయ్య ఫోన్ చేసి వసూ ఐ లవ్ యూ అంటూ చెప్పుకొచ్చారు.

వసుంధర ఐ నో యు ఆల్వేస్ లవ్ మీ అంటూ సమాధానం ఇచ్చారు.

పెళ్లైన తర్వాత రానాలో బ్యాలెన్స్ వచ్చేసిందని బాలయ్య కామెంట్లు చేశారు.అప్పట్లో రానా పూల రంగడులా తిరిగేవాడివి అంటూ బాలయ్య అన్నారు.

ఆ తర్వాత రానా మీ షో ఇలా వెళుతుందా అంటూ షోపై కామెంట్లు చేశారు.

ఈ నెల 7వ తేదీన రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

బాలయ్య తన హోస్టింగ్ తో అదరగొడుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అన్ స్టాపబుల్ తర్వాత సీజన్ కు కూడా బాలకృష్ణ హోస్ట్ గా ఉంటారేమో చూడాలి.

ఝార్ఖండ్ లో ఈడీ సోదాలు.. భారీగా నగదు పట్టివేత