ఆ హీరోయిన్లే విప్పుకుని చూపించారు… నేను చేస్తే తప్పేంటీ…?

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించినటువంటి "నగ్నం" అనే చిత్రంలో తన హాట్ హాట్ అందాలతో సినీ ప్రేక్షకులకు అందాల విందు చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీ రాపాక అలియాస్ దేవరపల్లి స్వీటీ ప్రస్తుతం రోజుకి ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో తరచూ వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో శ్రీ రాపాక పాల్గొంది.ఇందులో భాగంగా టాలీవుడ్ పలువురు స్టార్ హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే ఇందులో తాను నటించిన నగ్నంచిత్రంలో ఎక్కువగా ఎక్స్ పోజింగ్  చేయలేదని కేవలం 2 లేదా 3 సన్నివేశాలు డిమాండ్ చేసినందు వల్ల కొంతమేర ఎక్స్ పోజింగ్ చేశానని చెప్పుకొచ్చింది.

అలాగే అనుష్క, రకుల్ ప్రీత్ సింగ్ తదితర హీరోయిన్లు వన్  పీస్ , టూ పీస్ బికినీలు అంటూ ఎక్స్ పోజింగ్ చేసినప్పుడు లేనిది నేను చేస్తే తప్పేంటి అంటూ ఫైర్ అయ్యింది.

అలాగే ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాలలో కొందరు తన గురించి కామెంట్లు చేస్తూ శ్రీ రాపాక కేవలం డబ్బు కోసం మాత్రమే ఎక్స్ పోజింగ్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారని, అది సరికాదని అంటోంది ఈ అమ్మడు.

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయం గురించి స్పందిస్తూ సినిమాల్లో నటించాలనే దృఢమైన సంకల్పంతో సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలని అప్పుడే బాగా రాణిస్తానని శ్రీ రాపాక కి కొందరు మద్దతు తెలుపుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు గతంలో పలు టాలీవుడ్ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.

కాగా ఇటీవలే టాలీవుడ్ లెజెండ్ హీరో బాలయ్య బాబు మరియు బ్యూటిఫుల్ ఫుల్ క్వీన్ రాశి కన్నా పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.

పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ కాంగ్రెస్‎లో విభేదాలు