అంకుల్స్ తో ఆట ఆడుకున్న శ్రీముఖి… క్రేజీ అంకుల్స్ ట్రైలర్

ఈ మధ్యకాలంలో స్టార్ శ్రీముఖి ఓ వైపు టెలివిజన్ షోలతో యాంకర్ గా ఓ వైపు బిజీగా ఉంటూనే మరో వైపు వరుసగా ఫిమేల్ సెంట్రిక్ కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినిమాలు చేస్తుంది.

ఇప్పటికే ఇట్స్ టైం టూ పార్టీ అంటూ ఒక సినిమా పూర్తి చేసింది.

ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా శ్రీముఖి కనిపించబోతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు క్రేజీ అంకుల్స్ సినిమాతో సందడి చేయడానికి రెడీ అవుతుంది.

కామెడీ చిత్రాలని ఎక్కువగా తెరకెక్కించిన ఇ సత్తిబాబు దర్శకత్వంలో క్రేజీ అంకుల్స్ సినిమా తెరకెక్కింది.

ఇందులో రాజా రవీంద్ర, మనో, భరణి అంకుల్స్ లో నటించారు.ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఇక ట్రైలర్ ఆద్యంతం కామెడీ టైమింగ్ తో కాలక్షేపం చేసింది.ఒక అపార్ట్మెంట్ లో ఉండే ముగ్గురు ఏజ్ మళ్ళిన అంకుల్స్ కి ఆడవాళ్లంటే ఉండే వీక్ నెస్ కారణంగా కొత్తగా అపార్ట్ మెంట్ లోకి వచ్చిన శ్రీముఖి కి లైన్ ఇస్తారు.

శ్రీముఖి కోసం వారు పడే పాట్లు ఆద్యంతం ఆహ్లాదంగా ట్రైలర్ లో చూపించారు.

"""/"/ ఇక అంకుల్స్ తన వెంట పడుతున్నారని తెలుసుకున్న తర్వాత ఆమె వారితో ఎలా ఆడుకుంది.

ఫైనల్ గా వారిని ఎలా దారిలోకి తెచ్చింది అనే విషయాలని సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

మనో కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చాలా ఏళ్ల తర్వాత మరల అతను తెరపై కనిపిస్తూ ఉండటంతో వినోదానికి డోకా ఉండదని అర్ధమవుతుంది.

ఎక్కువగా సీరియస్ పాత్రలు చేసే భరణి ఈ సినిమాలో కామెడీ రోల్ లో సందడి చేయబోతున్నాడు.

ఇక రాజారవీంద్ర కూడా ఫుల్ లెంత్ కామెడీ రోల్ లో ఈ సినిమాలో చేయబోతున్నాడు.

వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.మొత్తానికి శ్రీముఖి నుంచి వచ్చే ఏడాది రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలు ప్రేక్షకులకి వినోదాన్ని అందించడానికి రాబోతున్నాయి.

వాటితో ఈ స్టార్ యాంకర్ ఎంత వరకు ప్రేక్షకులని మెప్పిస్తుంది అనేది చూడాలి.

ఆర్య మూవీ లో ఈ షాట్ కోసం అల్లు అర్జున్ చేసిన పని తెలిస్తే ..?