కామెడీ స్టార్స్ కు శ్రీముఖి ఎందుకు గుడ్ బై చెప్పిందో తెలుసా?

యాంకర్ శ్రీముఖి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.బుల్లితెర యాంకర్ గా ఈమె అందరికీ సుపరిచితమే.

బుల్లితెరపై పలు షోలలో తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కలుపుకు పోతూ తన ముద్దు ముద్దు మాటలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.

ఇక ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అంతే కాకుండా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ తో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

శ్రీముఖి అభిమానులు ఆమెను ముద్దుగా రాములమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు.మొదట పటాస్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ యూత్ నీ ఆకట్టుకుంది.

యూత్ లో శ్రీముఖి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే కామెడీ స్టార్స్ లో యాంకర్ శ్రీముఖి వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

అయితే యాంకర్ గా ఈ షోలో సెట్ అయింది అనుకునే లోపే శ్రీముఖి బదులు ఆ షోకి యాంకర్ గా వర్షిని వచ్చింది.

"""/" / యాంకర్ వర్షిని తప్పించి మరి శ్రీముఖి ని తీసుకొని రాగా, ప్రస్తుతం మళ్లీ శ్రీముఖి స్థానంలో దీపికా పిల్లి వచ్చింది.

మరి ఈ షోకు యాంకర్గా దీపికా పిల్లి రావడంతో, ఈ షో నుంచి శ్రీముఖుని తప్పించారా, లేకపోతే కొద్ది రోజుల పాటు దూరంగా ఉంటుందా అన్న విషయం పై క్లారిటీ రాలేదు.

ఇంకా కామెడీ స్టార్స్ కు ధమాకా అని యాడ్ చేసి కాస్త డోస్ ని పెంచారు.

ఇక సూపర్ స్టార్స్ నుంచి వెళ్లిపోయిన శ్రీముఖి జీ తెలుగులో ప్రసారం అవుతున్న సూపర్ క్వీన్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఆమె ఆ షోలో కనిపించడంతో కామెడీ స్టార్స్ ను ఈ సూపర్ క్వీన్ షో కోసమే వదిలేసుకుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

అందరికీ నమస్కారం ! నేను క్రాంతి ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని