పీఎస్ఎల్వి సి-52 నమూనాకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఇస్రో సైంటిస్ట్ బృందం దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఇస్రో సైంటిస్ట్ బృందం సభ్యులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

14వ తేది పీఎస్ఎల్వి సి-52 లాంచింగ్ చేయనున్న నేపథ్యంలో సి-52 నమూనాను శ్రీవారి మూలవిరాట్ పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సి-52 నమూనాకు వేదాశీర్వచనం చేసారు.ఆలయ అధికారులు ఇస్రో సైంటిస్ట్ బృందానికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

అమెరికన్ టౌన్‌లో సాలెపురుగుల ప్రేమ కథ.. చూసేందుకు తండోపతండాలుగా వస్తున్న జనం..?