బిగ్ బాస్ విన్నర్ కు ప్రైజ్ మనీ మాత్రమే కాదట.. ఇంకో ఆఫర్ కూడా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కూడా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఎన్ని ట్రోల్స్ వచ్చిన.ఎన్ని వివాదాలు చుట్టూ ముట్టినా మంచి టీఆర్పీ రేటింగ్ తో ఈ షో దూసుకు పోతుందనే చెప్పాలి.

చిన్న చిన్న వివాదాలు, ట్రోల్స్ పెద్దగా ఈ షో పై ప్రభావం చూపించలేక పోతున్నాయి.

ఇక ఈ షోలో వచ్చే కంటెస్టెంట్స్ కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి తీసుకు వస్తారు.

వారి వారి ఫాలోయింగ్ ను బట్టి, గుర్తింపు ను బట్టి వారానికి ఇంత అని రెమ్యునరేషన్ ను ఫిక్స్ చేస్తుంటారు.

ఇక ఆ కంటెస్టెంట్స్ ఎన్ని వారాలు షోలో ఉంటే అన్ని వారాల ఎమ్యూనరేషన్ ఇస్తారు.

ఇక ఫైనల్ విజేతకు కూడా భారీ రెమ్యునరేషన్ ను ముట్ట జెబుతారు.ఫైనల్ వరకు ఆడి విజేతగా నిలిచినా కంటెస్టెంట్ కు 50 లక్షల ఫ్రీజ్ మనీ ఇస్తారనే విషయం గత నాలుగు సీజన్స్ చుసిన వారికీ అర్ధం అయ్యే ఉంటుంది.

కానీ ఈసారి 50 లక్షల ప్రైజ్ మనీ మాత్రమే కాక మరొక అదిరిపోయే కానుక కూడా ఇవ్వబోతున్నారు బిగ్ బాస్.

"""/"/ ఈ విషయాన్నీ స్వయంగా నాగార్జున షోలో ప్రకటించారు.ఇంతకీ షో లో విన్నర్ గా నిలిచినా కంటెస్టెంట్ కి 50 లక్షల ప్రైజ్ మనీ తో పాటు మరొక గిఫ్ట్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.

నిన్నటి ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున ఈ అదిరిపోయే ఆఫర్ ను కంటెస్టెంట్స్ తో చెప్పాడు.

"""/"/ అది ఏంటంటే.ఈ సీజన్ లో విన్నర్ గా నిలిచినా కంటెస్టెంట్ కు 50 లక్షలతో పాటు మరొక కానుకగా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు నాగార్జున.

విన్నర్ కు ప్రైజ్ మనీ తో పాటు షాద్ నగర్ లోని సువర్ణ కుటీర్ లో 25 లక్షల రూపాయల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని కూడా ఇవ్వబోతున్నట్టు తెలిపాడు.

దీంతో ఈసారి విజేత కు లక్ మాములుగా లేదని అంత అనుకుంటున్నారు.ఇక ఈ స్థలాన్ని ఆ సంస్థ తమ ప్రొమోషన్ కోసం ఇస్తున్నట్టు తెలుస్తుంది.

నాగ్ అశ్విన్ మీ ఓం రౌత్ లాంటి వాడు కాదు.. బాలీవుడ్ మెడలు వంచే మొనగాడు