మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన పనికి.. స్పెషల్ గెస్ట్ మొహం మాడిపోయిందిగా?

ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ జరుగుతుంది.ఈ కార్యక్రమాన్ని సింగర్స్ అందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు అన్న విషయం తెలిసిందే.

ఎంతోమంది సింగర్స్ తమ పాటలతో ఈ కార్యక్రమంలో ప్రేక్షకులందరినీ కూడా ఉర్రూతలూగిస్తూ ఉంటారు అని చెప్పాలి.

అయితే ఇటీవలి కాలంలో ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి ప్రతి ఎపిసోడ్ లో ఒక గెస్ట్ ని పిలవడం ఇక వారితో అటు సింగర్స్ ను మరింత ఎంకరేజ్ చేయించడం లాంటివి చేస్తూ ఉన్నారు నిర్వాహకులు.

అయితే ఇటీవలే విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఉషా ఉతుప్ ఇండియన్ ఐడిల్ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.ఉషా ఉతుప్.

మీకు గుర్తుండే ఉంటుంది.ఈమె సీనియర్ సింగర్.

ఈ పేరు తెలియని వారు కూడా ఈమె వేషధారణ చూస్తే మాత్రం తప్పకుండా గుర్తుపడతారు అని చెప్పాలి.

ఇక ఎంతమంది సింగర్స్ ఉన్న ఈమె వాయిస్ మాత్రం కాస్త డిఫరెంట్ అని చెప్పాలి.

హస్కీ వాయిస్ తో పాటలు పాడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.ఇక ఈమె ఏదైనా షో కీ స్పెషల్ గెస్ట్ గా వచ్చిందంటే ఏకంగా ఒక బంగారం షాప్ నడుచుకుంటూ వస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది ప్రేక్షకులకు.

అసలు విషయానికి వస్తే.ఇటీవల ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చింది ఉషా ఉతుప్.

"""/"/ ఈ కార్యక్రమంలో పాటలు పాడుతున్న అందరు కంటెస్టెంట్స్ ని కూడా తన కామెంట్లతో ఎంకరేజ్ చేసింది ఒక సింగర్ విషయంలో మాత్రం కాస్త నెగిటివ్ కామెంట్ చేసింది.

నీ వాయిస్ చాలా బాగుంది.కానీ నీ పాటతో నేను కన్ఫ్యూస్ అయ్యాను అంటూ సరిగ్గా పాట పాడ లేదు అనే సంకేతాలను ఇచ్చింది ఉషా ఉతుప్.

దీంతో అందరూ షాక్ అయ్యారు.పక్కనే ఉన్న మరో జడ్జి థమన్ మాత్రం ఎంతో అద్భుతం గా పాడావు.

నీ వాయిస్ తో అందరిని మెస్మరైజ్ చేశావు.పర్ఫామెన్స్ అదిరిపోయింది అంటూ ఉషా ఉతుప్ కామెంట్లకు భిన్నంగా జడ్జిమెంట్ ఇచ్చాడు.

దీంతో ఒక్కసారిగా ఆ స్పెషల్ గెస్ట్ మొహం మాడిపోయినంత పని అయింది.ప్రోమో కోసమే ఇలాంటివీ వేశారా నిజంగానే షోలో ఇది జరిగిందా అన్నది మాత్రం ప్రస్తుతం ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది.

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి పై వైసీపీ సంచలన ఆరోపణలు