మాదకద్రవ్యాలు,సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి:ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

సూర్యాపేట జిల్లా( Suryapet District ):మాదక ద్రవ్యాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని,సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను అదేశించారు.

గురువారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్,మఠంపల్లి పోలీస్ స్టేషన్లను ఎస్పీ జనరల్ విజిట్ చేసి,స్టేషన్ల పరిస్థితిని,రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరల్ విజిట్లో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్లో తనిఖీ చేస్తానన్నారు.

జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై,సైబర్ నేరాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజలకు అవగాహన కోసం సదస్సులు కూడా ఏర్పాటు చేయాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామన్నారు.

ఈ కార్యక్రమం లో కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి,( DSP Sridhar Reddy ) హుజూర్ నగర్ సీఐ చలమందరాజు,ఎస్సై ముత్తయ్య,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వైరల్ వీడియో: జూలో గొరిల్లా చేసిన పనికి ఆశ్ఛర్యపోయిన ప్రజలు..