CM Revanth Reddy : ప్రజావాణిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్..!!
TeluguStop.com
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రజావాణిపై ప్రత్యేక దృష్టి సారించారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డికి ప్రజావాణి బాధ్యతలను అప్పగించారు.ఈ నేపథ్యంలో ప్రతి నెలలో రెండుసార్లు ప్రజావాణి దరఖాస్తులపై చిన్నారెడ్డి ( ChinnaReddy )సమీక్షించనున్నారు.
"""/" / అయితే ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమానికి ప్రత్యేక నోడల్ అధికారిగా ఐఏఎస్ దివ్య( IAS Divya ) ఉన్నారన్న సంగతి తెలిసిందే.
సోమ, శుక్ర వారాల్లో పూలే ప్రజాభవన్ వేదికగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఇప్పటివరకు ప్రజావాణి దరఖాస్తులు 4,90,825 వచ్చాయి.
వీటిలో 3,96,224 పరిష్కారం కాగా ప్రస్తుతం 94,601 ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.