మెరుగవుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం… ధన్యవాదాలు తెలిపిన చరణ్

సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి గత కొంత కాలం నుంచి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.

కరోనా కారణంగా ఆయన పరిస్థితి విషమంగా మారింది.అయితే డాక్టర్లు నిరంతరం శ్రమించి మళ్ళీ అతనిని సాధారణ స్థితికి తీసుకొని వచ్చారు.

ఇక ఎస్పీ బాలు పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే తెలుగు చిత్ర పరిశ్రమ గుండె తడి ఆరిపోయింది.

స్టార్ హీరోల నుంచి గాయకుల వరకు అందరూ ఆయన ఆరోగ్యంతో తిరిగి రావాలని కాక్షించారు.

ప్రార్ధనలు చేశారు.బాలు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఇక అతని ఆరోగ్య పరిస్థితిపై కుమారుడు ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నాడు.

ఆ మధ్య కరోనా తగ్గిందని వచ్చిన రూమర్స్ ని ఖండించాడు.తాజాగా అతని ఆరోగ్యం మెరుగవుతుందని క్లారిటీ ఇచ్చారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్నారని ఆయన ఎస్పీ చరణ్ వెల్లడించారు.

నిన్నటితో పోల్చితే తన తండ్రి ఆరోగ్యం మెరుగైందని, ఆయన ఊపిరితిత్తులపై కరోనా ప్రభావం తగ్గుతోందని వివరించారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి ఆశాజనకంగా ఉందనడానికి అనేక సంకేతాలు కనిపిస్తున్నాయని, తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వీడియో సందేశంలో పేర్కొన్నారు.

త్వరలో ఎస్పీ బాలు మెరుగైన ఆరోగ్యంతో బయటకి రావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

కరోనా కారణంగా ఈ ఏడాది చాలా మంది సెలబ్రేటీల జీవితాలలో విషాదం నిండింది.

కొంత మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు.మరికొంత మంది తనువు చాలించారు.

సినీ, రాజకీయ ప్రముఖులలో కరోనా బారిన పడి మరిణించిన వారు ఉత్తర భారతంలో ఎక్కువ మంది ఉన్నారు.

తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. తప్పక ప్రయత్నించండి!