కాసేపట్లో జనసేన అధికార ప్రతినిధులతో పవన్ భేటీ

జనసేన అధికార ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది.టీడీపీ - జనసేన పొత్తు అంశంపై నేతలతో జనసేనాని పవన్ చర్చించనున్నారు.

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై అధికార ప్రతినిధులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.

అయితే ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఈ ఎన్నికల్లో టీడీపీతో కూడా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

శోభితతో పెళ్లి జీవితం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?