పోకిరి సినిమాలో హీరో ఛాన్స్ మిస్ చేసుకున్న విలన్ అతడే!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి 40 కోట్ల రూపాయల షేర్ సాధించిన చిత్రంగా పోకిరి సినిమాకు పేరుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సి వస్తే పోకిరి సినిమాకు ముందు పోకిరి సినిమా తరువాత అని మాట్లాడుకోవాల్సి ఉంటుంది.

మహేష్ బాబు సూపర్ స్టార్ స్థాయికి ఎదగడానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే పోకిరి సినిమానే కారణం.

పోకిరి సినిమాతో అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలయ్యాయి.మహేష్ బాబు నటన, పూరీజగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ, బ్రహ్మానందం కామెడీ, క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాను సూపర్ హిట్ చేశాయి.

ఇతర భాషల్లో రీమేక్ అయిన ఈ సినిమా ఆ భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.

నిజానికి పూరీ జగన్నాథ్ మొదట పోకిరి సినిమా కథను మహేష్ బాబుకు వినిపించలేదు.

మొదట పూరీ పోకిరి కోసం పవన్ కళ్యాణ్ ను సంప్రదించగా వివిధ కారణాల వల్ల పవన్ కు పోకిరి సినిమా కథ నచ్చలేదు.

అయితే తాజాగా లాక్ డౌన్ సమయంలో అందరికీ సాయం చేసి ఆదుకుంటున్న సోనూసూద్ హీరోగా బాలీవుడ్ లో పోకిరి సినిమాలో నటించాల్సి ఉందని అయితే వివిధ కారణాల వల్ల వర్కవుట్ కాలేదని తెలుస్తోంది.

ఒకవేళ సోనూసూద్ ఈ సినిమాలో నటించి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకునేవాడని విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.

అయితే అరుంధతి సినిమాలోని విలన్ పాత్ర మాత్రం సోనూసూద్ కు టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోను గుర్తింపును తీసుకురావడం గమనార్హం.

మహేష్ బాబు కృష్ణవంశీ కాంబో లో మిస్ అయిన మరో సినిమా ఏంటో తెలుసా..?