మద్యం మత్తులో బైక్ నడిపి తల్లి ఊపిరి తీసిన తనయుడు.. ?

మద్యంతాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా వినే వారు ఎవరు.

తాగి వాహనం నడుపుతుండగా పట్టుబడితే చలానాలు అయిన కడుతున్నారు గానీ ఈ అలవాటు మాత్రం మానలేకపోతున్నారు.

ఇకపోతే మద్యం మత్తులో బైక్ నడిపిన ఓ వ్యక్తి కన్న తల్లి ఆయువును కాలరాసాడు.

తాగిన మత్తులో ఈ ప్రమాదానికి కారణం అయ్యాడు.ఆ వివరాలు తెలుసుకుంటే.

కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన రాజవ్వ అనే(65) సంవత్సరాల మహిళ తన కొడుకుతో కలిసి దగ్గర బంధువుల దశదిన కర్మ కు హజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది.

బంధువుల ఇంటి నుండి తన కొడుకు బైక్ పై వెళ్తుండగా ధర్మసాగర్ మండలంలోని సెంట్ అంతోని స్కూల్ ముందు ఉన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆటో కు ఢీ కొనడంతో బైక్ పై నుండి కింద పడిన రాజవ్వ అక్కడికక్కడే మృతి చెందింది.

కాగా మృతురాలి కుమారుడు మద్యం సేవించి ఉన్నాడని సమాచారం.ఇకపోతే ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇక పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

పూజ గదిలో ఈ వస్తువులు ఉండడం అంత మంచిది కాదా..?