అటు కొడుకు ఇటు కూతురు ! ఎవరికీ చెప్పుకోలేని బాధలో విజయమ్మ 

వైఎస్ కుటుంబంలో పెద్ద తుఫానే చెలరేగింది.ఆస్తుల వివాదంలో అటు వైఎస్ జగన్( YS Jagan ) ఇటు షర్మిల మధ్య మాటల వివాదం జరుగుతోంది .

ఒకరికొకరు లేఖలు రాసుకుంటూ మీడియాకెక్కిమరి విమర్శలు చేసుకుంటున్నారు.ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

అసలు కుటుంబాల మధ్య గొడవ ఎందుకని జగన్ ప్రశ్నిస్తుండగా , ఇది కుటుంబ గొడవ కాదని , ఒక తల్లి చెల్లికి జరిగిన అన్యాయం అంటూ టిడిపి కూడా ఈ విషయంలో విమర్శలు చేస్తోంది.

మీడియా ముందుకు వచ్చి మరి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.  జగన్ తరుపున వైసీపీ నాయకులు షర్మిలను టాబ్లెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబు( Chandrababu Naidu ) మెప్పుకోసమే షర్మిల ఈ విధంగా చేస్తున్నారని వైసీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టు మరి విమర్శలు చేస్తున్నారు.

జగన్ ఓటమి చెంది రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఆస్తుల వివాదం ఆయనకు మరింత తలనొప్పిగా మారింది.

వైయస్ కుటుంబంలో తలెత్తిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. """/" / అన్న చెల్లెల మధ్య ఇక ఏమాత్రం సఖ్యత లేదు అనే విషయం స్పష్టం అవుతోంది.

ఈ విషయాన్ని జగన్ కూడా చెప్పేశారు.  రాజకీయంగా తనను వ్యతిరేకించడమే కాకుండా వ్యక్తిగతంగా తనను తన కుటుంబం పై విమర్శలు చేయడంతో షర్మిల తో తెగ తెంపులు చేసుకోవడానికి జగన్ సిద్ధమైనట్లుగా అర్థమవుతుంది .

వైఎస్ షర్మిల సైతం జగన్ కు  దీటుగానే స్పందిస్తున్నారు.ఈ విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గనని తన వాటా తనుకు కావాల్సిందేనని,  ఒక ఆడపడుచుకు అన్యాయం చేస్తావా అంటూ జగన్ను నిలదీస్తున్నారు .

అయితే ఈ వ్యవహారంలో వైఎస్ విజయమ్మ( YS Vijayamma ) ఎటువైపు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది .

"""/" / వైయస్ కుటుంబ సభ్యులు సైతం ఈ వివాదంలో కలుగజేసుకునే ప్రయత్నం చేయడం లేదు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరులు, చెల్లెళ్లు సైతం ఈ వ్యవహారానికి దూరంగానే ఉంటున్నారు.

ఒకవైపు కొడుకు , మరోవైపు కూతురు ఎవరి వైపు నిలబడాలనే విషయంలో విజయమ్మ తేల్చుకోలేకపోతున్నారు .

దీంతో ఈ వ్యవహారంలో ఆమె మౌనంగానే ఉండిపోతున్నారు .ఒకరికి మద్దతుగా మాట్లాడితే మరొకరిని పూర్తిగా దూరం చేసుకున్నట్లే.

దీంతో ఈ విషయంలో ఆమె ఏమీ మాట్లాడలేని పరిస్థితి.దీంతో లోటస్ పాండ్ లోనే ఉండి మానసిక వేదనకు గురవుతున్నట్లుగా వైస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పుల నివారిణి కరక్కాయ.. ఎలా వాడాలో తెలుసా?