భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరదలపై సోషల్ మీడియా వార్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరదల పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది.

ఈ మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోను పినపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

ఓ వైపు ప్రజలందరూ వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, భట్టి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేతలు విందులు, వినోదాలు చేసుకుంటున్నారని విమర్శించారు.

ఈ క్రమంలో ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వీరయ్య ప్రజల బాధలను తీర్చలేక బీఆర్ఎస్ ఇటువంటి ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు.

ట్రంప్‌కే ఓటేయ్యండి.. ప్రవాస భారతీయులకు తులసి గబ్బార్డ్ పిలుపు