సమంత ఛాలెంజ్‌ స్వీకరించి ఇద్దరు హీరోయిన్స్‌ను ఛాలెంజ్‌ చేసిన రష్మిక

టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ మొదలు పెట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతోంది.

ప్రముఖులు ఎంతో మంది గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటారు.

ముఖ్యంగా సెలబ్రెటీలు ఎంతో మంది గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి మరికొందరిని ఛాలెంజ్‌ చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం సమంత మొక్కలు నాటి రష్మిక మందన్నను ఛాలెంజ్‌ చేసిన విషయం తెల్సిందే.

సమంత ఛాలెంజ్‌ను స్వీకరించిన రష్మిక మందన నేడు మొక్కను నాటింది.సమంత ఈ చాలెంజ్‌ లో తనను భాగస్వామిగా చేయడం సంతోషంగా ఉందంటూ రష్మిక చెట్లు నాటిన సందర్బంగా చెప్పుకొచ్చింది.

తాను స్వీకరించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ను రాశి ఖన్నా మరియు కళ్యాణి ప్రియదర్శిన్‌లకు ఛాలెంజ్‌ చేస్తున్నట్లుగా పేర్కొంది.

"""/"/ ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ చిత్రాలతో సక్సెస్‌లను దక్కించుకున్న రష్మిక మందన త్వరలో పుష్ప చిత్రంలో నటించబోతుంది.

మరో వైపు తమిళంలో కూడా స్టార్‌ హీరోకు జోడీగా ఛాన్స్‌ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.

సౌత్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్‌ జాబితాలో ఉంది.

చిన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను.. వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!