శివగంగా లిఫ్ట్ పైప్ లైన్ పగిలి కొట్టుకుపోయిన పత్తిచేను

సూర్యాపేట జిల్లా: చింతలపాలెం వెల్లటూరు గ్రామ పరిధిలోని శివగంగా ఎత్తిపోతల పథకం ద్వారా నేడు నీటిని విడుదల చేశారు.

నీటి విడుదల చేసిన గంటల వ్యవధిలోనే వెల్లటూరు గ్రామానికి చెందిన గడ్డం వీరయ్య అనే రైతు పొలంలో పైల్ లైన్ పగిలి,నీటి ప్రవాహానికి అతని మూడు ఎకరాల పత్తి చేను మొత్తం కొట్టుకొనిపోయిందని బాధిత రైతు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఇదే విధంగా మిర్చి పంట కొట్టుకుపోయి నష్టపోయాయని,ఇప్పుడు పత్తి చేను పోయిందని,తనకు జీవనాధారమైన పంట కొట్టుకుపోయి దిక్కులేని స్థితిలో ఉన్నానని,జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తనను ఆదుకోవాలని కోరారు.

సొంత ఊరిలో 100 ఎకరాల పొలం.. ఈ జబర్దస్త్ యాంకర్ సంపాదన మామూలుగా లేదు?