రాముడి పై భక్తిని చాటిన చిన్నారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: అయోధ్య రామ మందిరం లో ఈనెల 22న బాల రామ ప్రాణప్రతిష్ట ఉన్న నేపథ్యంలో వాణి నికేతన్ హై స్కూల్ విద్యార్థులు శ్రీరామ నామ ఆకృతి ప్రదర్శన కనబర్చారు.

అయోధ్య రాముని అక్షింతలను అన్ని గ్రామాల్లో ఇంటింటికి వితరణ చేస్తున్న కార్యక్రమానికి తోడుగా విద్యార్థులు ఇలా ప్రదర్శించడం అభినందనీయం అని పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

చిన్నారుల ప్రదర్శన పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనిధి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, రమేష్, సుమంగళి, రేఖ, రేవతి, కళ్యాణి విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ తెలుగు సాంగ్స్ ఎవరు పాడారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..