సింగర్స్ సునీత, మాళవికకు కరోనా.. ఎలా సోకిందంటే?
TeluguStop.com
ప్రపంచదేశాలకు కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్.ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.
గత ఏడాది డిసెంబరులో ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన ఈ ప్రాణాంతక కరోనా.
తక్కువ సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు విస్తరించడంతో పాటు లక్షల మంది ప్రాణాలను కూడా పొట్టనపెట్టుకుంది.
ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎదో రకంగా ఈ మహమ్మారి బారిన పడి.
నానా ఇబ్బందులు పడుతున్నారు.సామాన్యులు , సెలబ్రెటీలు అని తేడాలేకుండా అందరిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఇప్పటికే పలువురు సెలబ్రెటీలకు కరోనా సోకగా.అందులో కొందరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
అయితే తాజాగా సింగర్స్ సునీత, మాళవిక ఇద్దరూ కూడా కరోనా బారినపడినట్టు సమాచారం.
ఇటీవల వీరిద్దరూ ఓ టీవీ ఛానెల్ కోసం రూపొందించిన సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారట.
ఈ కార్యక్రమం అనంతరం ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు కనిపించడంతో.ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్లు చేయించుకున్నారట.
అయితే ఆ టెస్ట్ల్లో వీరిద్దరికీ కరోనా పాజిటివ్గా తేలిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు.
ప్రస్తుతం సింగర్స్ సునీత, మాళవిక ఇద్దరూ డాక్టర్ల సూచనలు మేరకు.హోం క్వారంటైన్లో ఉన్నట్టు తెలుస్తోంది.
రీల్స్ పిచ్చి.. రీల్స్ కోసం బైక్పై డేంజర్ స్టంట్స్.. దెబ్బకి?