సింగర్స్ సునీత, మాళవికకు క‌రోనా‌.. ఎలా సోకిందంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌.ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

గ‌త ఏడాది డిసెంబ‌రులో ఎక్కడో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగు చూసిన ఈ ప్రా‌ణాంత‌క క‌రోనా.

త‌క్కువ స‌మ‌యంలో ప్ర‌పంచంలోని అన్ని దేశాలు విస్త‌రించ‌డంతో పాటు ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను కూడా పొట్ట‌న‌పెట్టుకుంది.

ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎదో రకంగా ఈ మ‌హ‌మ్మారి బారిన పడి.

నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.సామాన్యులు , సెలబ్రెటీలు అని తేడాలేకుండా అందరిపై ఈ వైర‌స్ తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది.

ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రెటీలకు క‌రోనా సోక‌గా.అందులో కొంద‌రు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజాగా సింగర్స్ సునీత, మాళవిక ఇద్ద‌రూ కూడా క‌రోనా బారిన‌పడిన‌ట్టు స‌మాచారం.

ఇటీవ‌ల వీరిద్ద‌రూ ఓ టీవీ ఛానెల్ కోసం రూపొందించిన సంగీత కార్యక్రమంలో పాల్గొన్నార‌ట‌.

ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం ఇద్ద‌రిలోనూ క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో.ఎందుకైనా మంచిద‌ని క‌రోనా టెస్ట్‌లు చేయించుకున్నార‌ట‌.

అయితే ఆ టెస్ట్‌ల్లో వీరిద్ద‌రికీ క‌రోనా పాజిటివ్‌గా తేలింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం సింగర్స్ సునీత, మాళవిక ఇద్ద‌రూ డాక్ట‌ర్ల సూచ‌న‌లు మేర‌కు.హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

వీడియో వైరల్: నొప్పి లేకుండా రక్తం తీయడం ఇకపై సులభంగా.. ఆనంద్ మహీంద్రా ట్వీట్..