అతనిని తలచుకొని షోలో కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ సునీత..!

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి అందరికీ తెలిసిందే.

ఇక ఈమె రెండవ వివాహం చేసుకున్న తర్వాత తన కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఒకవైపు తన బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడమే కాకుండా మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా కొనసాగుతూ పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే పాడుతా తీయగా అనే కార్యక్రమానికి సునీత న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కంటెస్టెంట్ దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ప్రియతమా నా హృదయమా" పాట పాడుతుంటే.

 ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎస్పీ బాలు తనయుడు చరణ్ ఈ పాట గురించి మాట్లాడుతూ తన తండ్రి బాలసుబ్రమణ్యంను తలచుకుని ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ఒకప్పుడు ఈ పాట నాకు ఎంతో ఇష్టమైనది.

ప్రస్తుతం ఈ పాట చాలా కష్టంగా మారిందని బరువెక్కిన హృదయంతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

/br. """/"/ ఈ విధంగా ఈ పాటకు అర్థాన్ని వివరిస్తూ మాట్లాడలేక ఎమోషనల్ అయిన చరణ్ ను చూసి ఈ కార్యక్రమానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న సింగర్ సునీత కూడా బాలసుబ్రహ్మణ్యం గారిని తలుచుకొని షోలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే సునీతకు ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా సునీత తనని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోవడంతో షో మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.

ఏపీ గవర్నర్ నజీర్ కి మరో లేఖ రాసిన చంద్రబాబు..!!