మోక్షజ్ఞతోనే ఆ సీక్వెల్ అన్న సింగీతం శ్రీనివాసరావు.. అది మాత్రం దైవ నిర్ణయం అంటూ?

టాలీవుడ్ హీరో బాలకృష్ణ( Balakrishna ) హీరోగా నటించిన చిత్రం ఆదిత్య 369.

( Aditya 369 ) ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని ఏళ్లు పూర్తి అయిన విషయం మనందరికీ తెలిసిందే.

34 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదల అయ్యి అప్పట్లోనే భారీ విజయాన్ని అందుకుంది.

కలెక్షన్ల సునామీని సృష్టించింది.ఈ సినిమాలో బాలకృష్ణ మోహిని జంటగా నటించిన విషయం తెలిసిందే.

సంగీతం శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఎస్పీ బాలసుబ్రమణ్యం సమర్పణలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు అనగా ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

చాలా కాలం తర్వాత ఈ సినిమా మళ్లీ రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్( Director Singeetam Srinivas ) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"""/" / ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.34 ఏళ్ల క్రితం విడుదలైన ఆదిత్య 369 సినిమా రీ రిలీజ్‌( Aditya 369 Re-Release ) కావడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి.

ఈ సినిమాని ఇప్పుడు తీసుంటే బాగుండేది అనిపించిన క్షణాలు ఉన్నాయి.శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ సినిమాను నేటి టెక్నాలజీతో కంప్లీట్‌గా అప్‌గ్రేడ్‌ చేసి రీ రిలీజ్‌ చేస్తుంటే ప్రేక్షకులకే కాదు, నాలాంటి వాళ్లకి కూడా సినిమా చూడాలనిపిస్తుంది.

ఇదొక థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అని శ్రీనివాసరావు తెలిపారు.ఆదిత్య 369 సీక్వెల్‌ కి( Aditya 369 Sequel ) కూడా కథ సిద్ధం చేశాము.

ఈ మూవీ ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞని( Mokshagna ) హీరోగా పరిచయం చేయాలనుకున్నారు బాలకృష్ణ.

"""/" / ఈ మూవీని ప్రకటించినప్పటికీ కుదరల్లేదు.కానీ ఆయన మాత్రం ఎప్పటికైనా సీక్వెల్‌ చేయాలని అంటుంటారు.

అది ఎప్పుడు అవుతుందన్నది దైవ నిర్ణయం.నేను కాలేజీలో చదువుతున్నప్పుడు హెచ్‌.

జి.వెల్స్‌ రచించిన ‘ది టైమ్‌ మిషన్‌’ నవల ఆధారంగా ఆదిత్య 369 తీశాను.

ఈ కథలో లీనమై సంగీతం అందించారు ఇళయరాజా.పీసీ శ్రీరామ్, వీఎస్‌ఆర్‌ స్వామి, కబీర్‌ లాల్‌ ఇలాముగ్గురు కెమేరామెన్లు పని చేయడం దైవ నిర్ణయం.

పేకేటి రంగాగారు శ్రీకృష్ణ దేవరాయలవారి సెట్‌ని, టైమ్‌ మెషిన్‌ను అద్భుతంగా డిజైన్‌ చేశారు అని తెలిపారు.