మన్మధుడు మళ్లీ ప్రేమలో పడ్డాడట..!

కోలీవుడ్ స్టార్ హీరో శింబు మళ్లీ ప్రేమలో పడినట్టుగా వార్తలు వస్తున్నాయి.తమిళంలో తన విలక్షణ నటనతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న శింబు నయనతార, హన్సిక, త్రిష ఇలా హీరోయిన్స్ కొందరితో లవ్ స్టోరీస్ నడిపాడు .

శింబు, నిధి అగర్వాల్ ఇద్దరు కలిసి తమిళ సినిమా ఈశ్వరన్ లో నటించారు.

ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేదు.అయితే ఆ సినిమా టైం లో శింబు, నిధి చాలా క్లోజ్ అయ్యారట.

ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు టాక్ .తెలుగులో చేసిన మూడు సినిమాలకే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం సంక్రాంతికి గల్ల అశోక్ హీరో సినిమాతో వస్తుంది.

ఇదే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాలో కూడా నిధి అగర్వాల్ నటిస్తుంది.

కోలీవుడ్ మీడియా శింబు, నిధిల లవ్ స్టోరీ పై కథనాలు రాస్తుంది.మరి నిజంగానే శింబు, నిధి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

భారతీయులు లేకుండా యూఎస్ టెక్ ఇండస్ట్రీ కష్టమే : సిలికాన్ వ్యాలీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో