సొంతింటి కలను నెరవేర్చే భూ వరాహస్వామి.. ఈ ఆలయాన్ని దర్శిస్తే కోరిన కోరికలు తీరతాయా?

మనలో చాలామంది సొంతింటి కలను( Home ) నెరవేర్చుకోవాలని భావించడంతో పాటు ఆ కలను నెరవేర్చుకోవడం కోసం రేయింబవళ్లు కష్టపడుతూ ఉంటారు.

కొంతమందికి ఆ కల సులువుగానే నెరవేరితే మరి కొందరికి మాత్రం ఆ కల నెరవెరే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.

అయితే ఒక ఆలయాన్ని దర్శించుకుంటే మాత్రం సొంతింటి కల కచ్చితంగా నెరవేరుతుంది.ఆలయంలోని భూ వరాహ స్వామిని( Bhoo Varahaswamy ) పూజించడం ద్వారా కన్న కలలను కచ్చితంగా నెరవేర్చుకోవచ్చని చాలామంది భావిస్తారు.

ఎంతోమంది భక్తులు వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి చేరుకుని మట్టి, ఇటుకలకు పూజలు చేసి వాటిని ఇంటికి తీసుకెళ్లి ఆ తర్వాత ఇంటికి సంబంధించిన పనులను మొదలుపెడతారు.

ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంటి నిర్మాణం మొదలవుతుందని చాలామంది భావిస్తారు.

కర్ణాటక రాష్ట్రంలోని( Karnataka ) మండ్య జిల్లా కే.ఆర్.

పేటె, వరాహనాథ కల్లహళ్లిలో( Varahanatha Kalahalli ) ఈ ఆలయం ఉంది. """/" / ఈ ఆలయానికి ఏకంగా 3,000 సంవత్సరాల చరిత్ర ఉంది.

ఈ ఆలయంలో భూవరాహ స్వామి లక్ష్మీదేవి సమేతుడై, చతుర్భుజుడిగా దర్శనమిస్తాడు.స్థల పురాణం ప్రకారం ఈ ఆలయంలో హిరణ్యాక్షుడు( Hiranyakshudu ) అనే అసురుడిని సంహరించడానికి నారాయణుడు వరాహ రూపాన్ని దాల్చాడు.

ఇక్కడి ఆలయ ప్రాంగణంలోనే మట్టి, ఇటుకలు లభిస్తాయి.ఈ ఆలయానికి చేరుకోవాలనుకునే భక్తులు పాండవపుర రైల్వే స్టేషన్ వరకు రైలులో చేరుకోవచ్చు.

"""/" / బస్సులో ప్రయాణం చేయాలభి భావించే వాళ్లు బెంగళూరు నుంచి ఆర్టీసీ బస్సు ద్వారా ప్రయాణం చేయవచ్చు.

మైసూరు నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాలలో సైతం ఆలయానికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది.

సొంత వాహనాలలో ఈ ఆలయానికి రావాలని భావించే వాళ్లు మండ్య జిల్లా పాండవపుర నుంచి భూపనకెరె మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఇక్కడి పండితులు చెబుతున్నారు.

రాబోయే సినిమాతో అఖిల్ అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నాడా..?