హిందువులు ముఖ్యంగా జరుపుకొనే అతి పెద్ద పండుగలలో సంక్రాంతి కూడా ఒకటని చెప్పవచ్చు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఈ పండుగను మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
సూర్యుడు ధనుర్మాసం నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ పండుగను మకర సంక్రాంతి అని కూడా పిలుస్తారు.
ధనుర్మాసం చివరి రోజును, సంక్రాంతికి ముందు రోజును భోగి అని పిలుస్తారు.ఈ భోగి రోజు నుంచి సంక్రాంతి పండుగ సంబరాలు మొదలవుతాయి.
"""/"/
భోగి రోజు తెల్లవారు జామున నిద్ర లేచి ఇంటిముందు అందమైన రంగవల్లులను వేసి అందులో భోగి మంటలను వేసి ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.
ధనుర్మాసంలో సూర్యుడు ఉత్తరాయణంలో ఉంటాడు.దక్షిణాయనం చివరి రోజు వాతావరణంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
అలాగే సూర్యుడు దక్షిణార్థ గోళంలో నుంచి ఉత్తరార్థ గోళంలో కి ప్రవేశించడం ద్వారా చలి ఎక్కువగా ఉండటం వల్ల ఈ చలి తీవ్రతను తట్టుకోవడం కోసం ప్రజలు మంటలను వేసుకుంటారు.
భోగి రోజు ఈ మంటలను వేయడం ద్వారా వీటిని భోగి మంటలు అని కూడా పిలుస్తారు.
"""/"/
ఈ భోగి మంటలను వేసుకొని ఇంతకుముందు పడిన కష్టాలను బాధలను తొలగించి సుఖ సంతోషాలతో గడపాలని భావించి మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను ఈ మంటలలో వేసి తగల పెడుతుంటారు.
అలాగే ఈ భోగిమంటల ద్వారా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
ఈ భోగి మంటలను ఎక్కువగా ఆవు పిడకలతో వేస్తారు.ఆవు పిడకలు కాల్చడం ద్వారా మన వాతావరణంలో ఉన్న సూక్ష్మజీవులు నశించిపోయి, ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదలవుతుంది.
ఈ గాలిని పీల్చడం ద్వారా చలికాలంలో వ్యాపించే అనేక వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.
ఈ విధంగా భోగి పండుగ ప్రజలకు భోగభాగ్యాలను ఇవ్వడమే కాకుండా, మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందని చెప్పవచ్చు.