సిద్ధార్థ్ త్రిభాషా చిత్రం..!

కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అయితే అది ఒకప్పుడు ఇప్పుడు సిద్ధార్థ్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు.

ఈమధ్యనే మహా సముద్రం అంటూ వచ్చినా పెద్దగా ప్రభావం చూపించలేదు.ఇక కొద్దిపాటి గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ ఓ సినిమా చేస్తున్నారు.

ఇటకీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో త్రిభాషా చిత్రంలో సిద్ధార్థ్ నటిస్తున్నారు.ఇప్పటికే 3 సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించిన ఈ ప్రొడక్షన్ హౌజ్ నుండి వస్తున్న నాల్గవ సినిమా ఇది.

ఈ సినిమాకు ఎస్.యు అరుణ్ కుమార్ డైరక్షన్ చేస్తున్నారు.

విజయ్ సేతుపతి హీరోగా నటించిన పన్నైయూరుమ్‌ పద్మినియుమ్ సినిమాను డైరెక్ట్ చేసిన అరుణ్ కుమార్ ఇప్పుడు సిద్ధార్థ్ ని డైరెక్ట్ చేస్తున్నారు.

టైటిల్ ఇంకా నిర్ణయించని ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ని సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.

తమిళంతో పాటుగా తెలుగు, మళయాళ భాషల్లో కూడా ఈ సినిమా రూపొందిస్తున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్ తమిళనాడు పళనిలో జరుపుకుంటున్నారు.

 ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు సిద్ధార్థ్.  సినిమాతో సిద్ధార్థ్ మళ్లీ ఫాం లోకి వస్తారేమో చూడాలి.

నా కోసం 7/జి బృందావన్ కాలనీ క్లైమాక్స్ మార్చారు : రకుల్ ప్రీత్