ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అత్యధిక మెజార్టీతో గెలవడం తెలిసిందే.

చాలా సంవత్సరాల తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం ఆ పార్టీ క్యాడర్ కి ఎంతో సంతోషాన్ని కలిగించింది.

మరి ముఖ్యంగా రాహుల్ పాదయాత్ర తర్వాత భారీ మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కేడర్ కి మంచి ఉత్సాహాన్ని కలిగించింది.

ఇదంతా పక్కన పెడితే ఎన్నికలు ఫలితాలు వచ్చాక కర్ణాటక సీఎం పదవి విషయంలో చాలా తర్జనా బర్జన జరగటం తెలిసిందే.

చివర ఆఖరికి సిద్ధరామయ్యకి( CM Siddharamaiah ) కాంగ్రెస్ హైకమాండ్ పదవి ఇవ్వటం జరిగింది.

"""/" / ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి పదవిపై( CM Seat ) సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు సీఎం పదవి సంతోషాన్ని ఇవ్వదని వ్యాఖ్యానించారు.ప్రజలకు సేవ చేసేందుకు ఈ పదవిని ఒక గొప్ప అవకాశంగా  భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

వరుణ నియోజకవర్గంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ఇవే నా చివరి ఎన్నికలని.

ఇదివరకే చెప్పాను.భవిష్యత్తులో ఎన్నికల్లో పాల్గొనకపోయినా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తాను.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు హామీలను కచ్చితంగా అమలు చేస్తాం.చరిత్రక విజయం అందించినందుకు కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు అని సిద్ధరామయ్య ప్రసంగించారు.

ఈ అవార్డుకు నువ్వు అర్హుడివి.. కన్నడ నటుడు రిషబ్ శెట్టి పై బన్నీ కామెంట్స్!