చిరంజీవి కి ఇచ్చిన మాట కోసం శ్యామ్ ప్రసాద్ రెడ్డి చేసిన పని చూడండి

అమ్మోరు, అంజి, అరుంధతి వంటి సినిమాల పేర్లు చెప్తే ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

ఇలాంటి సినిమాలు తీయాలంటే మంచి అభిరుచి ఉండాలి.ఖచ్చితంగా మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేరు ముందుగా వస్తుంది.

మల్లెమాల లాంటి ఒక ప్రొడక్షన్ కంపెనీ చేతిలో ఉన్న కూడా, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న కూడా ఏడ పెడా సినిమాలు తీయలేదు.

మంచి స్క్రిప్ట్ ఉంటే, ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందని అనుకుంటే ఎంత ఖర్చు పెట్టైనా సినిమాలు తీయడానికి వెనకాడరు.

ఏం ఎస్ రెడ్డి లాంటి లెజెండ్ కి కొడుకుగా టాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం ఉన్నా కూడా ఏనాడూ మీడియా ముందు గొప్పలు చెప్పుకోలేదు.

1987 తలంబ్రాలు వంటి సినిమాతో మొదటి సారి సినిమా ప్రొడ్యూస్ చేసి విజయాన్ని సాధించారు.

ఆ తర్వాత రాజశేఖర్ తో వరసగా సినిమాలు చేసారు.నమ్మిన స్నేహితుడితో వరస హిట్లు ఇచ్చి స్నేహం కన్నా మిన్న ఏమి లేదు అని తెలియచేసారు.

తలంబ్రాలు సినిమా తర్వాత ఆహుతి, అంకుశం, ఆగ్రహం సినిమాలు చేసారు.ఇందులో ఆగ్రహం మిన్నగా మిగతా మూడు సినిమాలు చాల పెద్ద విజయాన్నే ఇచ్చాయి.

ఆ తర్వాత అయన కోడి రామ కృష్ణ తో వరస సినిమాలు చేసారు.

అవి అమ్మోరు, అంజి, అరుంధతి.ఇంతే.

కెరీర్ మొత్తం మీద ఏడూ సినిమాలు నిర్మిస్తే మొదటి నాలుగు సినిమాలు రాజశేఖర్ హీరో గా నటించగా, ఆరు సినిమాలకు కోడి రామ కృష్ణ దర్శకత్వం వహించారు.

"""/"/ ఇలా కోడి రామ కృష్ణ తో అన్ని సినిమాలు తీసిన రికార్డు శ్యామ్ ప్రసాద్ రెడ్డి కి మాత్రమే దక్కుతుంది.

ఇక చిరంజీవి తో డేట్స్ దొరికాక నేరుగా కోడి రామకృష్ణ ఇంటికి వెళ్లిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి మంచి గ్రాఫిక్స్ తో కూడిన సినిమా తీయమని అడిగారట.

కానీ గ్రాఫిక్స్ చాల ఖర్చుతో కూడుకొని ఉంటుంది, అలాగే సమయం కూడా తీసుకుంటుంది వద్దు అంటే చిరంజీవి గారికి మాట ఇచ్చాను ఎంత ఖర్చయినా తీస్తాను అని చెప్పి అంజి సినిమా తీయించారు.

ఆ సినిమా లో ఉన్న గ్రాఫిక్స్ కోసం అనేక దేశాల్లో ఎంతో రీసెర్చ్ చేశారట.

ఆలా మంచి అభిరుచి ఉన్న నిర్మాతరగ అయన పేరు ఎప్పుడు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఆ టార్చర్ భరించలేకే జబర్దస్త్ మానుకున్నా.. ఇన్నాళ్లకు బయటపెట్టిన ఆది?