మహేష్ ఛాలెంజ్‌ను శృతిచేసిన బ్యూటీ.. ఇక తారక్ బాకీ!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా తన పుట్టినరోజును మహేష్ కుటుంబ సభ్యుల మధ్యనే జరుపుకున్నాడు.

కాగా తన పుట్టినరోజున ఓ మంచి పని చేయాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఓ మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో తనవంతు బాధ్యతను నిర్వర్తించాడు.

కాగా ఈ క్రమంలో మరో ముగ్గురు స్టార్స్‌ను మహేష్ మొక్కలు నాటాల్సిందిగా వారిని నామినేట్ చేశాడు.

కోలీవడ్ స్టార్ హీరో విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అందాల భామ శృతి హాసన్‌లను మొక్కలు నాటాలంటూ మహేష్ కోరాడు.

దీంతో తమిళ హీరో విజయ్ మహేష్ కోరిక మేరకు మొక్కను నాటాడు.దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

కాగా తాజాగా తమిళ బ్యూటీ శృతి హాసన్ కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని ఆమె కూడా ఓ మొక్కను నాటింది.

తనను నామినేట్ చేసినందుకు మహేష్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.పర్యావరణాన్ని పరిరక్షించడం అందిర కర్తవ్యం అని ఆమె ఈ సందర్భంగా గుర్తుకు చేసింది.

కాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అందరూ పాల్గొనాలని చెబుతూ మరో ముగ్గురు స్టార్స్‌ను ఆమె నామినేట్ చేసింది.

బాలీవుడ్ బ్యూటీ హృతిక్ రోషన్, టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి, మిల్కీ బ్యూటీ తమన్నాలను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలంటూ ఆమె ఛాలెంజ్ చేసింది.

మొత్తానికి మహేష్ నామినేట్ చేసిన ముగ్గురిలో ఇద్దరు ఇప్పటికే ఈ టాస్క్‌ను పూర్తి చేయగా, ఒక్క తారక్ మాత్రమే ఇంకా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయలేదు.

మరి తారక్ తనవంతు బాధ్యతను ఎప్పుడు నిర్వర్తిస్తాడో చూడాలి.

టాయిలెట్‌లో వింత శబ్దం.. తీరా చూస్తే 10 అడుగుల పెద్ద పాము?