ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే స్వీట్ న్యూస్.. ప్రశాంత్ మూవీ షూట్ మొదలు అప్పుడేనా?

ఎన్టీఆర్( NTR ) ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబో క్రేజీ కాంబో కాగా ఈ కాంబో మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా మొదట ప్రచారంలోకి వచ్చిన వార్తల ప్రకారం ఈ నెలలోనే మొదలుకావాల్సి ఉండగా ఈ సినిమా తెలుస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెలలో మొదలు కానుంది.

జూనియర్ ఎన్టీఆర్ లేకుండానే ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది.అయితే మేకర్స్ వైపు నుంచి ఇందుకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఒకింత స్పెషల్ గా ఉండనుందని విదేశాల్లో ఈ సినిమా షూట్ జరగనుందని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ నెలలో దేవర( Devara ) ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు.

"""/" / సెప్టెంబర్ నెల 27వ తేదీన దేవర మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఏకంగా 300 నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.

సలార్( Salaar ) సినిమా సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

సలార్ 2 కంటే ముందు ఎన్టీఆర్ సినిమాకే ప్రశాంత్ నీల్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

"""/" / గత రెండు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ వార్తల్లో వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ కాగా ఆ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ కొత్త లుక్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ అభిమానులను ఎంతగానో మెప్పిస్తున్నారు.

జక్కన్న, మాస్ మహారాజు వంటి ముద్దు పేర్లను వీళ్లకు ఎవరు పెట్టారో తెలుసా.. ?