ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీపై షాకింగ్ అప్డేట్.. ఫ్యాన్స్ ఆశ్చర్యపోయేలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకావడానికి మరో ఏడాది సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా పారితోషికాల కోసమే 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల మేర ఖర్చయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ సినిమాలకు 500 కోట్ల రూపాయల స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం శాటిలైట్, డిజిటల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఉండటంతో నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది.

"""/"/ అయితే తారక్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించనున్నారంటూ ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్డేట్ ప్రచారంలోకి వస్తోంది.

అధికారికంగా క్లారిటీ లేకపోయినా వైరల్ అవుతున్న ఈ వార్త తారక్ అభిమానులకు ఎంతగానో నచ్చేసింది.

వరుసగా ఆరు హిట్లను ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకుని ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఎన్టీఆర్ ను ఊరమాస్ గా ప్రశాంత్ నీల్ చూపించనున్నారని తెలుస్తోంది.ఎన్టీఆర్ సైతం ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఎన్టీఆర్ తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి.ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుంది.

MLC Kavitha Anil : తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో అనిల్ ములాఖత్..!