45 డేస్ కోసం పూజా హెగ్దే అంత డిమాండ్ చేస్తుందా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పే పేరు పూజా హెగ్దే.

ఆమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాలు ఇస్తున్నా సరే ఆమె మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.

రాధే శ్యాం, బీస్ట్, ఆచార్య సినిమాలు ఆమెకు ఫ్లాప్ ఇచ్చినా సరే అమ్మడు మాత్రం మరిన్ని క్రేజీ ఛాన్సులను అందుకుటుంది.

అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది పూజా హెగ్దే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్, మహేష్ త్రివిక్రం కాంబో మూవీతో పాటుగా పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న జన గణ మన సినిమాలో కూడా ఆమెని తీసుకున్నారని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా కోసం పూజా హెగ్దే వి 45 రోజుల దాకా డేట్స్ అడిగినట్టు తెలుస్తుంది.

అందుకోసం అమ్మడు 4.5 కోట్ల రెమ్యునరేషన్ అడిగినట్టు టాక్.

మొన్నటివరకు 2, 2.5 కోట్ల దాకా ఉన్న పూజా హెగ్దే ఇప్పుడు ఏకంగా నాలుగున్నర కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది.

ఇదంతా ఆమెకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకునే అడుగుతుందని అంటున్నారు.దర్శక నిర్మాతలు కూడా పూజా సినిమాలో ఉంటే గ్లామర్ కి ఢోకా ఉండదనే ఆలోచనతో కూడా ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారు.

కవిత ఎలాంటి తప్పు చేయలేదు..: కేసీఆర్